ప్రధాని మోడీనే నా చావుకు కారణం.. వ్యాపారి సెల్ఫీ వీడియో !

-

తాను వ్యాపారంలో నష్టపోవడానికి ఆర్థికంగా చితికి పోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఏ కారణమంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ చిరువ్యాపారి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఫేస్బుక్ లైవ్లో విషయం తాగారు. మిషన్ తాగొద్దని, ఆత్మహత్య చేసుకోవద్దు అని వ్యాపారి భార్య ఆయనను ఎంతో వేడుకున్నారు. కానీ..” ప్రభుత్వం ఎలాగున్నా మాట వినదు కనీసం నువ్వైనా విను” అంటూ లైవ్ లో నే విషం తాగాడు ఆ వ్యాపారి. ఇక తన భర్త విషయం తాగడానికి భరించలేని భార్య విషయం తాగారు.

భార్య పూనం చనిపోగా… భర్త రాజు తోమర్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఈ దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భాగ్ పట్ జిల్లా సుభాష్ నగర్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… రాజీవ్ నగర్ సుభాష్ నగర్ లో చెప్పుల దుకాణం నడిపిస్తున్నాడు.

అయితే లాక్ డౌన్ కారణంగా తన చెప్పుల దుకాణం మూత పడిపోయింది. అయితే కేంద్ర ప్రభుత్వం తనకు ఆర్థిక సహాయం చేస్తుందని ఆశించాడు రాజీవ్. కానీ కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు కాకుండా బడా కంపెనీలకు రాయితీలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన.. రాజీవ్ తోమర్… ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే దీనికి సంబంధించిన వీడియోను టిఆర్ఎస్ పార్టీ నేత కృషాంక్ కు షేర్ చేశారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రధాని మోడీ పై ఫైరవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version