పవిత్ర లోకేష్ – నరేష్ వ్యవహారంలో కీలక మలుపు!

-

పవిత్ర లోకేష్ – నరేష్ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న ట్రోలింగ్ ఆపాలంటూ పవిత్ర లోకేష్ – నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలు యూట్యూబ్ ఛానల్ కు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. నటుడు నరేష్ మరోసారి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తమను ట్రోలింగ్ చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, కొంతమంది వ్యక్తులపై ఆయన క్రిమినల్ డిఫర్మషన్ వేశారు.

దీంతో 12 మందిపై విచారణ చేపట్టాలని నాంపల్లి కోర్టు సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది. ఇమండి టాక్స్ రామారావ్, రెడ్ టీవీ, లేటెస్ట్ తెలుగు డాట్ కామ్, లైఫ్ ఇన్స్ప్రెషన్, రమ్య రఘుపతి, మూవీ న్యూస్, ది న్యూస్ క్యూబ్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్ , దాసరి విజ్ఞాన్ , కృష్ణ కుమారి , మిర్రర్ టీవీ లకు నోటిసులు ఇచ్చి విచారణ జరపాలని నాంపల్లి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news