రాష్ట్రంలో ప్రతి మూలకు చరిత్ర ఉంటుంది : సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

-

బీఆర్‌కే భవన్‌లోని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కార్యాలయంలో అడపా సత్యనారాయణ, డాక్టర్‌ ద్యావనవెళ్లి సత్యనారాయణ రాసిన ‘తెలంగాణ హిస్టరీ, కల్చర్, మూవ్‌మెంట్స్‌’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎస్‌ సోమేశ్‌ కుమార్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆర్థిక, సామాజిక, అభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. ప్రస్తుత తెలంగాణాలను పోల్చుతూ మరింత పరిశోధనాత్మక రచనలు వెలువడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి మూలకు చరిత్ర ఉంటుందని సీఎం కేసీఆర్‌ అంటుంటారని, ఈ గ్రంథంలోని చారిత్రక అంశాలను చూస్తే మరోసారి నిరూపిస్తోందని పేర్కొన్నారు సోమేశ్‌కుమార్‌.

పరిశోధనాత్మక రచనలు రావాలి : సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రను 2వేల సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమైందని చెబుతూ వస్తున్నారని, కానీ తెలంగాణ భూభాగంలో 18 లక్షల సంత్సరాల క్రితం నుంచే ఆది మానవులు ఎదుగుతూ వచ్చారన్నారు సోమేశ్‌కుమార్‌. ఆ పరిణామ క్రమంతో పాటు ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాల చరిత్రను సమగ్రంగా విశ్లేషిస్తూ ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాల’ను ప్రత్యేకంగా వివరిస్తూ విషయ నిపుణులు అడపా సత్యనారాయణ, ద్యావనపల్లి సత్యనారాయణ ఆంగ్లంలో ‘తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ మూవ్‌మెంట్స్‌’ను సాధికారికంగా రాయడం అభినందనీయమని అన్నారు సోమేశ్‌కుమార్‌.

Read more RELATED
Recommended to you

Latest news