ఏపీలో కర్ఫ్యూ ఎత్తివేత…సీఎం జగన్ కీలక నిర్ణయం !

-

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏపీ లో ప్రస్తుతం నైట్‌ కర్ఫ్యూ అమలు అవుతోంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా కఠిన ఆంక్షలు అమలు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్థానిక టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలు మధ్యాహ్నం నుంచే ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఐతే.. ఈ నెల 14 తో ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ గడువు ముగియనుండటంతో సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

 

రాష్ట్రంలో రోజు వారీ కేసులు తగ్గుతున్న కరోనా కేసులను దృష్టి లో పెట్టుకుని ఆంక్షలు సడలించే అవకాశం కనిపిస్తోంది. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆంక్షలు కొనసాగించి.. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పూర్తి స్థాయిలో ఎత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో కర్ఫ్యూ ఎత్తివేత పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news