పవన్ కళ్యాణ్‌ రూ.1800 కోట్లు స్కాం చేసి..కేంద్రానికి దొరికాడు -దాడిశెట్టి రాజా

-

పవన్ కళ్యాణ్‌ రూ.1800 కోట్లు స్కాం చేసి..కేంద్రానికి అడ్డంగా దొరికాడని ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న శ్రీకాకుళం లో నిర్వహించిన రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ముఖ్యంగా ఏపీ మంత్రులు అయిన రోజా, గుడివాడ అమర్నాథ్ మరియు అంబటి రాంబాబు లను టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్.

వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. అయితే ఆ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా సంచలన ఆరోపణలు చేశారు. రూ.1800 కోట్లు పోలాండ్‌కు హవాలా చేస్తూ సాక్ష్యాధారాలతో పవన్ కళ్యాణ్ కేంద్రం చేతికి చిక్కాడని రెండు, మూడు నెలలుగా ప్రచారం జరుగుతోందని బాంబ్‌ పేల్చారు దాడిశెట్టి రాజా.

 

Read more RELATED
Recommended to you

Latest news