టీడీపీ హయాంలో మత్స్యకారులను హీనంగా చూశారు : మంత్రి ధర్మాన

-

ఎన్టీఆర్ ను విశేషంగా అభిమానించే మత్స్యకారులు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం ఏంటని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఇవాళ శ్రీకాకుళంలో ఫిష్ ఆంధ్రా మినీ స్టాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో మత్స్యకారులను హీనంగా చూశారని పేర్కొన్నారు. ఇంకా కొంతమంది అమాయకులు చంద్రబాబును నమ్ముతున్నారని, అలాంటి వారిని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన.

నాడు ఎన్టీఆర్ పరిస్థితి గురించి ఎంతో బాధపడిన మత్స్యకారులు ఇంకా చంద్రబాబుకు మద్దతిస్తున్నారని, మత్స్యకార గ్రామాల్లోనే ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందని మంత్రి ధర్మాన వెల్లడించారు. “నాడు ఎన్టీఆర్ ను హింసించి, అవమానించారు… అలా హింసించి, అవమానించడానికి కారకులు ఎవరో మీరు చూసుంటారు మంత్రి ధర్మాన. ఇలాంటివన్నీ మత్స్యకారులకు వివరిస్తుండాలి” అంటూ పార్టీ శ్రేణులకు బోధించారు మంత్రి ధర్మాన.  చేప పిల్లల ర‌వాణాకు 13 లక్షల 39 వేల రూపాయ‌లతో వాహ‌నం కొనుగోలు చేశారని, వేటకు వెళ్లి చనిపోయిన వారికి 10 లక్షల రూపాయ‌ల నష్టప‌రిహారం ఇస్తున్నామని చెప్పారు.. అర్హుల‌యిన వారికి డీజిల్‌పై సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

Read more RELATED
Recommended to you

Latest news