రోహిత్ శర్మ లేకపోయినా సరే..!

-

ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డేలు మూడు టి20లు, నాలుగు టెస్ట్ సిరీస్ లు ఆడనుంది భారత జట్టు. ఈ క్రమంలోనే భారత జట్టులో కీలక ఆటగాడైనా రోహిత్ శర్మ గాయం కారణంగా ప్రస్తుతం రికవరీ అవుతున్న నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరమయ్యాడు. టెస్ట్ సిరీస్లో అందుబాటులోకి వచ్చినప్పటికీ వన్డే టి20 లకు మాత్రం ప్రస్తుతం రోహిత్ శర్మ దూరం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇటీవలే వీడియో చాట్ లో మాట్లాడిన డేవిడ్ వార్నర్ టీమిండియా లో కీలక ఆటగాడైన రోహిత్ శర్మ లేకపోయినప్పటికీ… ఎంతో ప్రతిభ కల ఆటగాడైన కేఎల్ రాహుల్ శిఖర్ ధావన్ మయాంక్ అగర్వాల్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్ స్థానాన్ని భర్తీ చేయగల నైపుణ్యం ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారు అంటు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news