జిహెచ్ఎంసి ఓటర్లకు ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి…నిర్భయంగా ఓటు వేయండి !

-

జిహెచ్ఎంసి ఎన్నికల నేపధ్యంలో ఓటర్లకు ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేసింది. ఓటు మన హక్కు మాత్రమే కాదు బాధ్యత అని రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సరైన నాయకుడిని ఎన్నుకోండని ఎన్నికల కమిషనర్ ఒక ప్రకటనలో కోరారు.  కులమతాలకు అతీతంగా సమాజ అభివృద్ధికి ఓటేయండి అని అయన పేర్కొన్నారు.  జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు వేసి వార్డుల అభివృద్ధికి బాటలు వేయండని ఆయన కోరారు. యువత, విద్యాధికులు తప్పనిసరిగా ఓటింగులో పాల్గొని ఓటింగ్ శాతం పెంచండని అయన కోరారు.

కోవిడ్ పేషెంట్ లు, వికలాంగులు, 80 ఏండ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామని వారు దానిని వినియోగించుకొని ఓటేయమని కోరారు.   వికలాంగులు, వయోధికులకు పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు, ర్యాంపులు, వీల్ చైర్ లు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. వృద్ధులు, పసి పిల్లల తల్లులు, వికలాంగులు క్యూలైన్ తో సంబంధం లేకుండా నేరుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు.  పోలింగ్ కేంద్రంలో కోవిడ్ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం, నిర్భయంగా ఓటు వేయమని ఆయన కోరారు. డిసెంబర్ 1 వ తేదీ ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుని ఓటింగ్ శాతం పెంచమని అయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news