సెకండ్ మిస్టేక్ తో మళ్లీ ట్రోల్ అవుతున్న పూజా

-

పూజా హెగ్డే కు న్యూస్ మేకర్ గా మారడమంటే ఇష్టమనుకుంట. టంగ్ స్లిప్ అయ్యినందుకు ఒకసారి బాగా బుక్ అయిపోయిన ఈ సుందరి… ఈసారి తనకు గుర్తింపు తెచ్చిన హీరోని వదిలేసి మరో హీరోకు సోపు వేయబోయింది. ఇంకేముంది ఆ హీరో ఫ్యాన్స్ పూజాని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

 

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న బ్యూటీ పూజా హెగ్డే. రకుల్ ,రష్మిక లాంటి హేమా హేమీలను సైడ్ చేసుకుం టూ టాలీవుడ్ టాప్ పొజిషన్ కు దూసుకుపోతుంది.అలాగే కోలీవుడ్లోను ఈ అమ్మడికి మంచి ప్రిఫరెన్స్ దొరుకుతుంది. అలాంటి టైమ్లో సౌత్ సినీ పరిశ్రమ గురించి చవకబారు మాటలు మాట్లాడి అక్షింతలు వేయించుకుంది. తెలుగు ప్రేక్షకులకు థైస్, బొడ్డు అందం చూపిస్తే చాలు పెద్దగా నటించనక్కర్లేదు,వారే ఆధరిస్తారు అంటూ వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

తాజాగా పూజా మరోసారి టంగ్ స్లిప్ అయ్యింది.అయితే ఈసారి ఎన్టీఆర్ మ్యాటర్లో కాస్త ఎక్కువగా రియాక్ట్ అయింది. ఎన్టీఆర్,నా ఎనర్జి లెవల్స్ సేమ్ గా ఉండడంతోనే…అరవింద సమేతలో మా ఇద్దరి మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఈ మాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను సంతోష పెట్టిందో లేదో తెలియదుగాని తారక్ తో పాటు నాది సేమ్ ఎనర్జీ లెవెల్ అని గొప్పలకు పోవడంతో అమ్మడు ట్రోల్ అయింది.

పూజా ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ తో బన్నీ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు.పూజాకు తెలుగులో గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చిన సినిమా డిజే. అందులో బన్నీతో జతగా అమ్మడు చేసిన పర్ ఫార్మెన్స్ కు మంచి గుర్తింపు దక్కింది.సినిమా ఫ్లాపైనా ఈ బ్యూటీ నోటెడైంది.మరి అలాంట ఇమేజ్ తెచ్చిన ఆ సినిమాను వదిలేసి కేవలం తారక్ పేరే చెప్పడం ఎంతవరకు కరెక్ట్ .ఇదే బన్నీ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ అయ్యేలా చేస్తుంది.చూద్దాం రానున్న రోజుల్లో పూజాకు ఎన్ని సినిమాలొస్తాయో.

Read more RELATED
Recommended to you

Latest news