బ్రేకింగ్ : భారీ వర్షాలకు నేపాల్‌లో 132 మంది మృతి..!

-

గత కొద్ది రోజుల నుంచి నేపాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంగలు పొంగి పోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు దేశ‌వ్యాప్తంగా దాదాపు 998 కుంటుంబాలను ప్ర‌భావితం చేశాయి. వివిధ ప్ర‌మాదాల్లో మొత్తం 132 మంది నేపాలీలు ప్రాణాలు కోల్పోయారు. 128 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మ‌రో 53 మంది గ‌ల్లంత‌య్యారు. ప్రభుత్వం సహాయక చర్యలను కొనసాగిస్తున్నది.

ముంపు గ్రామాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించి పునరావాస కేంద్రాల్లో ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నారు. నేపాల్ డిజాస్ట‌ర్ రిస్కు రిడ‌క్ష‌న్ & మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులు ఎప్పటిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షిస్తూ బాధితుల‌కు సాయం అందిస్తున్నారు. క్షణక్షణం నరకం అన్న చందంగా ప్రజలు భయం గుప్పిట్లో బ్రతకాల్సిన పరిస్థితి ఎదురైంది.

Read more RELATED
Recommended to you

Latest news