జగన్ పై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఫైర్

-

జగన్ ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ సీరియస్ అయింది. న్యాయ వ్యవస్థను బెదిరించడానికి జగన్‌ ఇలా చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితం సుప్రీం న్యాయమూర్తులలో ఒకరయిన ఎన్వీ రమణ ఏపీ హైకోర్టు జడ్జ్ లను ప్రభావితం చేసిన కోర్టు తీర్పులు తమకు వ్యతిరేకంగా ఇప్పిస్తున్నారని పేర్కొంటూ సీజేఐ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.

అయితే న్యాయమూర్తుల మీద జగన్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, జగన్‌ రాసిన లేఖ కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది. ప్రజల్లో న్యాయవ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని కాల రాసేలా జగన్‌ రాసిన లేఖ ఉందని రాజ్యాంగ వ్యవస్థలపై జగన్‌ దాడి చేయడం దురదృష్టకరమని పేర్కొంది. ఇది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి మీద దాడి చేయడమేనని పేర్కొంటూ జగన్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీర్మానం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news