దీప్ సిద్దూ సమాచారం ఇస్తే లక్ష రివార్డ్..

-

ఢిల్లీ అల్లర్లకు సంబంధించి పోలీసులు నిందితుడిగా భావిస్తున్న పంజాబీ సింగర్ దీప్ సిద్ధూ మీద లక్ష రూపాయల రివార్డును ప్రకటించారు. దీప్ సిద్దు తో పాటు మరో ముగ్గురు మీద కూడా ఇలాంటి నగదు రివార్డ్ ప్రకటించారు ఢిల్లీ పోలీసులు. సమాచారం ఇస్తే లక్ష రూపాయల రివార్డు అందజేస్తామని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  రైతుల నిరసన సందర్భంగా హింసకు పాల్పడిన నలుగురిని అరెస్టు చేయించినందుకు గాను రూ .50 వేల నగదు బహుమతులు ప్రకటించారు.

ఎర్రకోట వద్ద సిక్కు జెండాలను ఎగురవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దీప్ సిద్ధూ, జుగ్రాజ్ సింగ్ మరియు మరో ఇద్దరికి పోలీసులు ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు.  జజ్బీర్ సింగ్, బుటా సింగ్, సుఖ్ దేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్ లకు రూ .50 వేల నగదు బహుమతి ప్రకటించారు. జనవరి 26 న జరిగిన హింసాకాండపై దర్యాప్తు జరిపేందుకు ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ బికె సింగ్, ముగ్గురు డిసిపిలు జాయ్ టర్కీ, భేషాం సింగ్, మోనికా భరద్వాజ్ల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news