ఢిల్లీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్

-

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న దేవేందర్ యాదవ్‌ను ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.ఇంతకుముందు అధ్యక్షుడిగా పనిచేసిన అరవిందర్ సింగ్‌ లవ్లీ కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఇది నాకు చాలా ముఖ్యమైన రోజు, నా మీద చాలా పెద్ద బాధ్యతను ఉంచారు అని అన్నారు. నాపై విశ్వాసం చూపినందుకు కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు, బాధ్యతలన్నింటినీ నెరవేర్చటానికి నేను అన్ని విధాల కష్టపడి పనిచేస్తానని ధీమా వ్యక్తం చేశారు. కష్ట సమయాల్లో ఉన్న పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి కృషి చేస్తాను. ఢిల్లీలోని మొత్తం 7 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని అన్నారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తుండగా, ఆప్ 4 స్థానాల్లో పోటీ చేస్తుంది. మొత్తం 7 స్థానాలకు మే 25న ఓటింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news