కాంగ్రెస్ ఏ హామీలు అమలు చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలి: హరీష్ రావు

-

6 గ్యారంటీలపై రాహుల్‌గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పించారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. నిర్మల్ సభలో పట్టపగలు రాహుల్ గాంధీతో పచ్చి అబద్దాలు చెప్పించారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడిందే కాకుండా రాహుల్ గాంధీతో అబద్దాలు చెప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు అమలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే రాహుల్ అంతకు మించిన అబద్దాల కోరని విమర్శించారు. అబద్దాలకు రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ అని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. మహిళలకు రూ.2500 ఇస్తున్నామని చెప్పడం రాహుల్ గాంధీ అవగాహన లేమికి నిదర్శనం. రాహుల్ గాంధీకి ఈ స్క్రిప్ట్ రాసించ్చింధా …లేక రాహుల్ గాంధీ కావాలని అబద్దాలు చెప్పారా?, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయనందుకు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news