వైరల్ గా మారిన దేవి శ్రీ ప్రసాద్ రెమ్యూనరేషన్..!

-

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన మంచి హిట్ ఆల్బమ్ ఇచ్చి చాలా కాలం అయ్యింది. అయితే తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. అయినా కూడా కొన్ని ట్రోల్స్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రూ. 250 బూర తో వాల్తేరు వీరయ్య సినిమాలోని ఒక పాటను కంపోస్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సినిమా కోసం ఆయన ఎంత పారితోషకం తీసుకున్నాడు అనేది వైరల్ గా మారింది.

ఇకపోతే వాల్తేరు వీరయ్య నుంచి ఇప్పటివరకు వచ్చిన పాటలు విన్నట్లయితే పరవాలేదు అనిపించుకున్నాయి. ముఖ్యంగా బాస్ పార్టీ కూడా ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తుంది. ఇకపోతే ఈ సినిమాలోని అన్ని పాటలు ఎలా ఉన్నా కూడా ఒక పాటపై మాత్రం ఇప్పుడు దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. పూనకాలు లోడింగ్ అనే పాట సినిమా మొత్తంలో హైలైట్ అవుతుందని.. ఇదివరకే చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. కానీ ఈ పాటపై ఇప్పుడు నెగిటివ్ ట్రోల్స్ కూడా వస్తూ ఉండడం గమనార్హం. అసలు విషయం ఏమిటంటే.. ఆ బూర సౌండ్ అసలు బాలేదు అనే కామెంట్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఇదిలా వుండగా తాజాగా దేవి శ్రీ ప్రసాద్ ఆ పాట కోసం వాడిన బూర గురించి తెలిపాడు . దానిని కేవలం రూ.250 కి కొనుగోలు చేసినట్లు చెబుతూ.. ఏదైనా కొత్తగా డిఫరెంట్ గా చేయాలనే ఆలోచనతోనే దీన్ని ఉపయోగించామని తెలిపాడు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది మన ఊరి జాతరలో 25 రూపాయల కూడా దొరుకుతుంది అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈయన ఈ సినిమా కోసం 5 కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news