తమన్ పై విజయం సాధించిన దేవీశ్రీ ప్రసాద్..!!

-

ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో బాలయ్య బాబు వీర సింహ రెడ్డి గా, చిరంజీవి వాల్తేరు వీరయ్య గా వస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య బాబు సినిమా  వీర సింహా రెడ్డి చిత్రం జనవరి 12 న రిలీజ్ కానుండగా, మెగాస్టార్  సినిమా వాల్తేరు వీరయ్య జనవరి 13 కి రిలీజ్ కానుంది. ఈ చిత్రాలు ఒకరోజు ముందుగానే యూఎస్ లో ప్రీమియర్ కానున్నాయి. అయితే ఓవర్సీస్ లో డిసెంబర్ 29, 2022 న అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ డేట్ కూడా త్వరలో వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇంకా థియేటర్స్ కోసం ఫైనల్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాల లో చిరు సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా, బాలయ్య కు ఎప్పటిలాగే తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాల వల్ల బాలయ్య, చిరంజీవి పోటీ గా కాకుండా తమన్ మరియు దేవీశ్రీ మధ్య పోటీ గా మారింది.

ఇక ప్రమోషన్ కోసం వదిలిన పాటల విషయంలో హంగామా నెలకొంది.24 హవర్స్ లో మొదటి పాట బాస్ పార్టీ సాంగ్ కి 9.51 మిలియన్ వ్యూస్ లభించగా 250.6 కే లైక్స్ లభించాయి, అదే సమయంలో జై బాలయ్య సాంగ్ కి 7 మిలియన్  208 K లభించాయి.రెండో సాంగ్ మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి  24 గంటలకు గాను 6.16 మిలియన్ వ్యూస్, 160.3 కే మిలియన్ వ్యూస్ సాధించగా బాలయ్య సుగుణ సుందరి  సాంగ్ .83 మిలియన్ వ్యూస్, 155.2 కే వ్యూస్ సాధించింది. ఇక మూడవ సాంగ్, వీరయ్య టైటిల్ సాంగ్ కి 5.47 మిలియన్ వ్యూస్ లభిస్తే 170.4 కే లైక్స్, బాలయ్య మా మనోభావాలు 5.27 మిలియన్ వ్యూస్ లభించగా 122.9 కే లైక్స్ లభించాయి. మొత్తంగా చూస్తే తమన్ పై దేవీశ్రీ పైచేయి సాధించినట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news