విశాఖ పరిపాలన రాజధానిగా ఎప్పుడైనా కావచ్చు – సజ్జల

-

విశాఖ పరిపాలన రాజధానిగా ఎప్పుడైనా కావచ్చు అని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. నేడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు తిరుమల శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.

అనంతరం ఆలయం వెలుపల సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా అభివృద్ధి చెందుతుంటే కొన్ని విషశ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. ఈ దుష్ట శక్తులను ఎదుర్కొనే శక్తిని జగన్ కు ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో మహా యజ్ఞం లా కొనసాగుతున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news