IPL 2023 : చెన్నైకి భారీ షాక్.. ధోనీకి గాయం?

-

ఐపీఎల్‌ 2023 కు కౌంట్‌ డౌన్‌ షురూ అయింది. రేపటి నుంచే ఐపీఎల్‌ 2023 ప్రారంభం కానుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2008లో ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 15 సీజన్లు విజయవంతంగా ముగిశాయి. రేపటి తొలి మ్యాచ్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్, ధోని కెప్టెన్సీ వహిస్తున్న చేత సూపర్ కింగ్స్ తో తలపడనుంది.

అయితే.. రేపటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీకి గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాక్టీస్ చేస్తుండ గా ధోని ఎడమ కాలికి గాయమైందని, గుజరాత్ తో జరిగే తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండడని సమాచారం. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ధోని గాయం పై సీఎస్కే యాజ మాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. సాయంత్రం జరిగే ప్రెస్ మీట్ లో క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version