రాష్ట్రపతి ప్రసంగానికి కాంగ్రెస్‌ ఎంపీలు దూరం

-

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెంట్రల్‌ హాల్‌లో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి కాంగ్రెస్ ఎంపీలు దూరంగా ఉన్నారు. రాజ్యసభ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పలువురు ఎంపీలు హాజరుకాలేదు.

సోమవారం శ్రీనగర్‌లో జరిగిన భారత్‌ జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొన్నారు. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, దాంతో ఖర్గేతో సహా పలువురు ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగానికి హాజరుకాలేకపోతున్నారని ఆయన వెల్లడించారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు పై స్పష్టత లేదు. ఇప్పటికే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని భారత్‌ రాష్ట్ర సమితి, ఆమ్‌ఆద్మీ పార్టీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news