దిల్ రాజు తన పంతం కోసం మరో స్కెచ్ వేయబోతున్నాడా

-

ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు  స్టార్ హీరో దళపతి విజయ్ తో మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని తో తమిళ్ లో వారీసు గా తెలుగు లో వారసుడుగా  అత్యంత భారీ స్థాయిలో  సినిమా నిర్మిస్తున్నారు. ఏమాంటూ ఈ సినిమా మొదలు పెట్టారో గాని దిల్ రాజు చేతలు మాటలు అన్నీ వివాదాలకు దారితీస్తున్నాయి. బోలెడంత నెగిటివ్ ప్రచారం నడుస్తోంది.

ఇక వారసుడు కోసం దిల్ రాజు రూ.250 కోట్ల వరకు పెట్టారట దీని రికవరీ కోసం చాలా టెన్సన్ పడుతున్నారు.ఇక ఒక ఇంటర్వ్యూ లో దిల్ రాజు  చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళనాడు లో  విజయ్ మరియు అజిత్ మధ్య గొడవలు జరిగేలా చేసాయి.విజయ్  అందరికంటే పెద్ద స్టార్. తమిళంలోి ఆయనకు పెద్ద మార్కెట్ వుంది. అన్న వ్యాఖ్యలు దీనికి మూల కారణం. అసలే ఫ్యాన్స్ మధ్య విపరీతంగా గొడవలు జరిగే తమిళనాడు లో ఇది అగ్నికి ఆజ్యం పోసింది.

ఇప్పుడు మరో పనితో మళ్లీ వివాదాల తుట్టెను కదుపుతున్నాడు.ఏ సినిమా అయినా సీడెడ్ లో జిల్లాల వారిగా సినిమా పంపిణీ అవుతూ వుంటుంది. అంటే అక్కడ జిల్లాకో పంపిణిదారుడు వున్నారన్నమాట. దీన్ని దిల్ రాజు అనుకూలంగా మలుచుకుని చక్రం తిప్పబోతున్నాడు. ఇది మైత్రి మూవీస్ వారిని దెబ్బ కొట్టడం కోసమే ఈ స్కెచ్ అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దీనికోసం తాజాగా దిల్ రాజు ఏషియన్ తో పాటు  కొంత మందిని కలుపుకుని ఓ సిండికేట్ గా మార్చి కొత్త పంపిణీ ఆఫీస్ ని ప్రారంభించాలనే ఆలోచనలో వున్నారట. చూస్తూంటే మరి కొన్ని రోజులు దిల్ రాజు పేరు మీడియా లో  హల్చల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news