పురాతన తవ్వకాల్లో బయటపడ్డ క్రీ.శ. 1070 నాటి పురాతన శివుని ఆలయం

-

మహారాష్ట్రంలోని నాందేడ్ జిల్లా హొట్టల్ గ్రామంలో జరిపిన తవ్వకాల్లో పురాతన శివుడి ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లను పరిశోధకులు కనుగొన్నారు.చాళుక్యుల కాలం నాటి దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన హొట్టల్ గ్రామంలో పూర్తి ఆలయంతో పాటు 3 రాతి శాసనాలు లభించినట్టు అధికారులు వెల్లడించారు. చరిత్రలో కళ్యాణి చాళుక్యుల రాజధానిగా ఉన్న హొట్టల్ ప్రాంతం అద్భుతమైన శిల్పాలకు, ఆలయాలకు ప్రసిద్ధి.

 

శాసనాలపై క్రీ.శ. 1070 ప్రాంతంలో ఆలయ నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు చెక్కబడి ఉన్నాయి.ఈ చారిత్రాత్మక దేవాలయాల్లో పునరుద్ధరణ కింద శిధిలాలను తొలగిస్తున్నప్పుడు అధికారులు ఆలయ స్థావరాన్ని గుర్తించారు. ఆలయం ఉన్నట్టు నిర్ధారించేందుకు పురావస్తు శాఖ అధికారుల బృందం 4 కందకాలను తవ్వారు. శివలింగంతో కూడిన ఆలయాన్ని వెలికితీశామని రాష్ట్ర పురావస్తు శాఖ నాందేడ్ డివిజన్ ఇన్‌ఛార్జ్ అమోల్ గోటె తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news