తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్..!

-

పండగ వేళ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రజలందరికీ జూలై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందజేయనున్నట్లు ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్ లో ఓ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. స్టేట్ లో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు.

ఎమర్జెన్సీలో అవసరమైన ట్రీట్ మెంట్ అందించడానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ప్రత్యేక నంబరుతో అందనుందన్నారు. ఆధార్ నంబర్ ఆధారంగా ప్రతి పౌరుడికి స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ నంబర్ ఇస్తామన్నారు. పేరు నమోదు చేయగానే వ్యక్తికి సంబంధించిన వైద్య సేవల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఏ వైద్యుడిని కన్సల్ట్ చేసినా.. వెంటనే హెల్త్ కండిషన్ తెలుసుకుని చికిత్స పొందే చాన్స్ ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news