పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ కు అందుకే జైకొట్టారు : దివ్యవాణి

-

అమరావతి పోరాటాన్ని ప్రపంచమంతా గమనిస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. పాదయాత్ర పేరుతో వీధివీధి తిరిగిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ప్రజలను వీధులపాలు చేశాడని ఆమె అన్నారు. వికేంద్రీకరణ అన్న తన వికృత ఆలోచనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని ఆమె అన్నారు. పోలీసుల సాయంతో ప్రతి పక్ష నేతలను, ప్రశ్నించే వారిని అడ్డుకున్న జగన్, అమరావతి కోసం పోరాడుతున్న రైతులు, మహిళలను మాత్రం అడ్డుకోలేకపోయాడని అన్నారు. 4 అడుగుల ప్రభుత్వ స్థలం ఆక్రమించాడని సబ్బంహరి ఇంటిగోడ పడగొట్టించిన జగన్, 33వేలఎకరాలు కోల్పోయినవారి బాధను ఎందుకు అర్థంచేసుకోడు? అని ఆమె ప్రశ్నించారు. దళితుల ఎదుగుదలను, వారి ఆర్థిక ఉన్నతిని చూడలేకనే జగన్ ప్రభుత్వం దళిత రాజధానిపై కక్షకట్టిందని ఆమె అన్నారు. జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించాక అక్కడ 73 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి.

అదే అసలైన ఇన్ సైడర్ ట్రేడింగ్ అని ఆమె అన్నారు. జగన్ నియమించిన కమిటీలన్నీ అమరావతిలో ఎటువంటి అవినీతి జరగలేదనే చెప్పాయి. వాలంటీర్ వ్యవస్థపేరుతో తనస్వార్థంకోసం జగన్మోహన్ రెడ్డి యువత భవిష్యత్ నాశనం చేస్తున్నాడని అన్నారు. 50 ఇళ్లు తమవనో, పింఛన్లు, రేషన్ పంచితేనో, తమ భవిష్యత్ బాగుపడి పోయిందని వాళ్ళు భావిస్తే అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదు. చంద్రబాబు తలపెట్టిన అమరావతిని పూర్తిచేసి ఉంటే, 13లక్షల మంది యువతకు ఉద్యోగాలు వచ్చిఉండేవని ఆమె అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే, తమ రాష్ట్రాలు బాగుపడవనే పొరుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ కు జైకొట్టారని అన్నారు. చంద్రబాబుకు పేరొస్తుందనో, తనపై ఉన్నకేసులనుంచి బయటపడటం కోసమో జగన్ పాలనచేయడం సరికాదని ఆమె అన్నార్. న్యాయస్థానాలు ప్రజలపక్షాన ఉన్నాయన్న అక్కసుతోనే వైసీపీ న్యాయవ్యవస్థపై దాడికి దిగిందని ఆమె అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news