పది పైసలకు బిరియానీ.. తమిళనాడులో ఎగబడ్డ జనం…!

-

రూపాయ్‌ పెడితే ఈ రోజుల్లో ఏం వస్తుంది? కానీ పది పైసలకు బిరియానీ దొరికిందంటే నమ్ముతారా? నిజమండీ..! తమిళనాడు, కర్నాటకలోని చాలా ప్రాంతాల్లో కారు చౌకగా బిరియానీ దొరికేసరికి జనం బారులుతీరారు. తెల్లారకముందే వచ్చి క్యూ కట్టారు. తమిళనాడులో బిరియానీ వేడుకల్లో భాగంగా కోయంబత్తూర్‌, తిరుచ్చి, కన్యాకుమారి, మధురైలో సెంటర్లు ఏర్పాటు చేశారు.

కొన్ని చోట్ల పదిపైసలకే బిరియానీ విక్రయించడంతో జనం ఎగబడ్డారు. ఇంతవరకు బాగానే ఉన్నా… ఓవైపు కరోనాతో అల్లాడుతున్న వేళ… ఎలాంటి నిబంధనలు పాటించకుండా… జనం గురిగూడడంపై అధికారులు మండిపడ్డారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news