ప్రేమ ఉంటే 13 సార్లు ఎలా నరుకుతాడు…?

-

దివ్యతేజస్విని తల్లిదండ్రులు మీడియా ముందు మాట్లాడారు. దివ్యతేజస్విని, నాగేంద్రబాబు ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకోవాలని భావిస్తే ఇంట్లోనే ఎందుకు చేసుకుంటారు..? అని ఆమె తల్లి ప్రశ్నించారు. పక్కా పథకం ప్రకారమే నా కుమార్తెను నిందితుడు నాగేంద్రబాబు హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేసారు. నా కూతుర్ని చంపేందుకే ముందుగానే పక్కా ప్లాన్, స్కేచ్ తోనే నాగేంద్రబాబు అలియాస్ స్వామి ఈ దురాగతానికి పాల్పడ్డాడన్నారు.

నిజంగా అతను నా కుమార్తెను ప్రేమిస్తే.. ఆమెపై 13 కత్తిపొట్లు ఎలా పొడవగల్గుతాడు..? అని నిలదీశారు. నాగేంద్రబాబుకు ఒంటిపై కేవలం రెండు గాయాలు మాత్రమే ఎందుకయ్యాయి..? ఇది నిర్థారించాల్సి ఉందని ఆమె అన్నారు. తేజస్విని ఇన్ స్ట్రాగ్రామ్ లో పెట్టిన వీడియోలో నాగేంద్రబాబు సైకోల వ్యవహరిస్తున్నాడని నా కూతురు స్పష్టం చేసిందని చెప్పారు. మంచితనంతోనే నమ్మించి మోసం చేసి హత్యకు తెగబడ్డాడన్నారు. మాకు తక్షణం న్యాయం చేయకపోతే మాకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news