మళ్లీ అనుపమ ను అడుగుతున్న డిజే టిల్లు.!

-

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన డీజే టిల్లు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పడు ఈ సినిమా కు సీక్వెల్ గా ‘టిల్లు 2 ను తీసుకొని వస్తున్నారు. ఇక ఈ సినిమా పై’ భారీ అంచనాలు వున్నాయి.ఈ మూవీని వచ్చే సంవత్సరం మార్చి నెలలో చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ సినిమా పై వరసగా వివాదాలే వస్తున్నాయి. ఇందులో మొదట పార్ట్ లో హాట్ గా నటించి సినిమాకు మంచి ప్లస్ అయిన నేహాశెట్టికి మళ్లీ అవకాశం ఇవ్వలేదు.  ఆమె బదులుగా కార్తికేయ 2 తో హిట్ కొట్టిన అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వన్ తీసుకున్నారు.ఇక ఆమె కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని మధ్యలోనే వదిలేసి బయటకు వచ్చింది. ఆమె ప్లేస్ లో మలయాళ బ్యూటీ ‘మడోనా సెబాస్టియన్ ‘మీనాక్షీ చౌదరి  ఆప్షన్ గా అనుకున్నారు. కాని అవేమీ వర్క్ అవుట్ కాలేదు.

మళ్లీ అనుపమ నే పెర్ఫెక్ట్ అని మళ్లీ ఆమెనే అడుగుతున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అనుపమ 18 పేజెస్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా అనుపమని డీజే టిల్లు 2 వివాదం గురించి అడిగారు. అనుపమ మాట్లడుతూ ఇప్పుడు 18 పేజెస్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. టిల్లు స్క్వేర్ లో ఏం జరుగుతోందో నాకు తెలియదు. నేను కూడా కొన్ని ఆర్టికల్స్ చదివాను అంటూ జవాబు ఇచ్చిందట.

 

Read more RELATED
Recommended to you

Latest news