చంద్రబాబు వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు – మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

జై తెలంగాణ అనడానికి కూడా నోరు రాని వ్యక్తి చంద్రబాబు అని.. ఆయన ఇప్పుడు మళ్ళీ తెలంగాణకు ఎందుకు వచ్చారని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. చంద్రబాబు వెనక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు అన్నారు. సమైక్య ముసుగులో ఇక్కడ మరోసారి డిస్టర్బ్ చేయడానికి చంద్రబాబు వచ్చారని ఆరోపించారు. ఆయన హయాంలో ప్రభుత్వ ఉద్యోగులను వేధించాడని అన్నారు.

చిన్న హైటెక్ సిటీ కట్టి పెద్దగా ఊహించుకున్నారని.. చంద్రబాబు తెలంగాణ రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాట అని విమర్శించారు. అంగన్వాడీలపై లాఠీచార్జి చేయించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని.. చంద్రబాబు పాచికలు ఇక్కడ నడవన్నారు. తమ మీదికి ఇప్పటికే ఐదు మందిని కూడా వదిలారని.. తెలంగాణ ప్రజలు చంద్రబాబు మాయలో పడరని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news