కవితను తీసుకొని ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తున్నారు – డీకే అరుణ

-

సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు మఖాం వేశారని ప్రశ్నించారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి లక్ష్మీతో కలిసి డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. ఈడికి మేము భయపడం అని చెప్తూనే.. ఎందుకు భయం పట్టుకుందని నిలదీశారు. కూతురు కవితను తీసుకొని ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెసిఆర్ కుటుంబాన్ని అంతం చేయడానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ విలువలు లేని రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు డీకే అరుణ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తోనే మునుగోడు నియోజకవర్గానికి నిధులు వస్తున్నాయని అన్నారు. కెసిఆర్ అవినీతి ఎప్పుడో ఒకసారి తప్పనిసరిగా బయటపడుతుందన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పి మంత్రి కేటీఆర్ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news