నీట్‌ పరీక్షను రద్దు చేయొద్దు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన 56 మంది విద్యార్థులు

-

నీట్‌-యూజీ 2024 పరీక్షలో అవకతవకలు, పేపర్‌ లీకేజీల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై దేశా అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా 56 మంది నీట్‌ ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

నీట్‌ పరీక్షను రద్దు చేయకుండా కేంద్రంతోపాటు ఎన్‌టీఏను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. నీట్‌ వ్యవహారంపై ఇప్పటివరకు 26 పిటిషన్లు దాఖలు కాగా.. వీటన్నింటినీ జులై 8న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.పరీక్ష రద్దు చేయడం అనేది నిజాయతీగా, కష్టపడి చదివే విద్యార్థులకు ఎంతో నష్టం చేస్తుంది అని , విద్యాహక్కు ఉల్లంఘనకూ దారితీస్తుంది. అందుకే నీట్‌-యూజీని రద్దు చేయకుండా కేంద్రంతోపాటు ఎన్‌టీఏకు ఆదేశాలివ్వాలి అని గుజరాత్‌కు చెందిన సిద్ధార్థ్‌ కోమల్‌ సింగ్లాతోపాటు మరో 55 మంది విద్యార్థులు కోర్టులో పిటిషన్‌ వేశారు. అంతేకాకుండా మే 5న నిర్వహించిన పరీక్షలో అవకతవకలకు పాల్పడిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖను ఆదేశించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news