అసలు విషయాలు పక్కన పెట్టి మత రాజకీయాలు చేస్తున్నారు.. కాంగ్రెస్ పై ఎంపీ డీకే అరుణ ఫైర్

-

లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.హిందువులు హింసకు పాల్పడతారంటూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రాహుల్ గాంధీ మాట్లాడారని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

గురువారం మహబూబ్ నగర్ లో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ….. ప్రతిపక్ష నేత అసలు విషయాలు పక్కన పెట్టి మత రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రాహుల్ గాందీ వ్యాఖ్యలను కార్యకర్తలందరూ క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో రిజర్వేషన్లు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news