సుశాంత్ మృతిని వాడుకోకు.. కంగనాకు సోనుసూద్ కౌంటర్..!?

-

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊహించని విధంగా యువనటుడు బలవన్మరణానికి పాల్పడటం ఎంతో మందిని కలిచి వేసింది. సుశాంత్ మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం మూగబోయింది. సుశాంత్ మరణంపై ఇప్పటికీ కూడా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆరోపణలు విమర్శలు వస్తూనే ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సుశాంత్ మరణం పై స్పందించిన బాలీవుడ్ నటుడు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సుశాంత్ మరణాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని చనిపోయిన వ్యక్తిని ప్రయోజనాల కోసం వాడుకోవడం హేయమైన చర్య అని అభివర్ణించారు సోనూ . ఇటీవలె సుశాంత్ మరుణంపై బాలీవుడ్ ప్రముఖులు కారణమంటూ కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సోనూ సూద్ సుశాంత్ ని ఒక్కసారి కూడా కలవని వారు… అన్ని తెలిసినట్టుగా మాట్లాడుతున్నారని.. న్యాయ పోరాటం చేస్తున్నారని.. ఇదంతా పబ్లిసిటీ కోసమే అంటూ సోనుసూద్ వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యల వల్ల సుశాంత్ కుటుంబం ఎంతో బాధ పడుతుంది అంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news