మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవికి ఎంతమంది సంతానమో తెలుసా !

-

టాలీవుడ్‌ హీరో మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హీరో మహేష్ బాబుకి మాతృ వియోగం కలిగింది. అనారోగ్య సమస్యలతో మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. దాదాపు నెల రోజుల నుండి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఇందిరా దేవి.. ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో మరణించారు.

దీంతో హీరో మహేష్ బాబు కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది. మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి అంత్య క్రియలు ఇవాళ సాయంత్రం చేయనున్నారని సమాచారం అందుతోంది. మహా ప్రస్థానంలోనే మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి అంత్య క్రియలు జరుగనున్నాయి.

అయితే.. ఇందిరాదేవికి ఐదుగురు సంతానం. ర‌మేష్ బాబు, మహేష్ బాబు, ప‌ద్మావ‌తి, మంజుల, ప్రియదర్శిని ఇందిరాదేవి సంతానమే. ఇందులో ర‌మేష్ బాబు… 8 నెలల కిందట మరణించారు. అతడు మరణించిన తర్వాత.. ఇవాళ ఇందిరాదేవి కన్నుమూశారు.

Read more RELATED
Recommended to you

Latest news