టీమిండియా వైస్ కెప్టెన్ గా సంజూ శాంసన్ !

-

టీమిండియా కీపర్‌ సంజూ శాంసన్ కు ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా ఉంది. అతన్ని టీ 20 వరల్డ్‌ కప్ కోసం ఎంపిక చేయకపోవడంతో.. అతని ఫ్యాన్స్‌ నానా రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంజూకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది బీసీసీఐ. స్వదేశంలో దక్షిణాఫ్రికా తో జరగనున్న వన్డే సిరీస్ కు భారత జట్టును బుధవారం బిసిసిఐ ప్రకటించే అవకాశం ఉంది.

అయితే ప్రోటీస్ తో వన్డే తో సిరీస్ కు టీ 20 ప్రపంచ కప్ 2022 భారత జట్టులో భాగంగా ఉన్న ఆటగాళ్లందరికీ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచ కప్ కోసం అక్టోబర్ 6వ తేదీన ఆస్ట్రేలియాకు పయనం అవుతుంది. అదే రోజున భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య తొలి వన్డే కూడా లక్నో వేదికగా జరగనుంది.

ఇక ప్రొటీస్ తో వన్డే సిరీస్ లో భారత జట్టు సారథ్య బాధ్యతలు ఓపెనర్ షికర్ ధావన్ చేపట్టే అవకాశం ఉంది. ధావన్ డిప్యూటీగా వికెట్ కీపర్ సంజు శాంసన్ బాధ్యతలు నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సీనియర్ జట్టుతో ఆస్ట్రేలియాకు వెళ్లనుండడంతో అతని స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news