నాగశౌర్య ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా?

-

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య ఓ ఇంటివాడ‌యిన విషయం తెలిసిందే. బెంగ‌ళూరుకు చెందిన అనూష మెడ‌లో మూడుమూళ్లు వేశాడు. ఆదివారం మ‌ధ్యాహ్నం బెంగ‌ళూరులోని జేడ‌బ్ల్యూ మారియ‌ట్ హోట‌ల్‌లో వీరి పెళ్లి జ‌రిగింది. ఈ పెళ్లికి నాగ‌శౌర్య, అనూష కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొంత‌మంది సినీ ప్ర‌ముఖులు, స‌న్నిహితులు హాజ‌ర‌య్యారు.

కొత్త జంట‌కు సినీ ప్ర‌ముఖుల‌తో పాటు అభిమానులు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తున్నారు. నాగ‌శౌర్య హీరోగా తెలుగులో ప‌లు సినిమాలు చేస్తోన్నాడు. కాగా నాగ‌శౌర్య భార్య అనూష శెట్టి బెంగ‌ళూరులో ఓ ఇంటిరీయ‌ర్ డిజైన‌ర్ కంపెనీని నిర్వ‌హిస్తోన్న‌ట్లు తెలిసింది.

గ‌త కొన్నాళ్లుగా నాగ‌శౌర్య‌, అనూష ప్రేమ‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. పెద్దల అంగీకారంతో త‌మ ప్రేమ‌ను పెళ్లిపీట‌ల‌పైకి తీసుకొచ్చిన‌ట్లు తెలిసింది.

పెద్దల సమక్షంలో అనూష శెట్టిని తన భార్యగా జీవితంలోకి ఆహ్వానించారు నాగశౌర్య. వీళ్ల పెళ్ళి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అనూష బ్యాక్ గ్రౌండ్ తెలిసిన క్రమంలో నాగశౌర్య ఎంత కట్నం తీసుకున్నాడు అనే విషయం ట్రెండ్ గా మారింది.

అనూష శెట్టి బ్యాగ్రౌండ్ చాలా పెద్దది . కోట్ల ఆస్తికి అధిపతిరాలు. అంతేకాదు నాగశౌర్యకు అనూష ఫ్యామిలీ భారీగానే కట్నం ఇచ్చినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సుమారు 40-50 కోట్లు దాకా అనుష నుండి నాగశౌర్యకు కట్నం వచ్చినట్లు న్యూస్ క్రేజీగా మారింది. ఏది ఏమైనా సరే అందమైన భార్యతో పాటు కోట్ల ఆస్తి కొట్టేసాడు నాగశౌర్య అంటూ కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news