ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి కేసు.. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

-

బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక విషయాలను వెల్లడించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై ఎంపీ అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే ఆయన ఇంటి పై దాడి చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కవితపై పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని.. దానికి నిరసనగానే దాడి జరిగినట్లు వివరించారు.

ప్రెస్మీట్లను పెట్టి తరచూ కవితను టార్గెట్ చేశారని, అనంతరం సోషల్ మీడియాలో సైతం వైరల్ చేశారని పేర్కొన్నారు. అందుకు నిరసనగానే దాడి జరిగిందని పేర్కొన్నారు. ఇంటి పై దాడి చేసిన తొమ్మిది మందిలో ఇద్దరు పీహెచ్డీ స్టూడెంట్స్ ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. దాడిలో ఇంట్లో పూజ సామాగ్రి, కారు ధ్వంసం కాగా.. ఘటనకు వాడిన రెండు సిమెంట్ రాడ్లు, రెండు కర్రలు, టిఆర్ఎస్ జండాలను స్వాధీనం చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news