మనదేశంలో చాక్లేట్ లను ప్రసాదంగా పెట్టే దేవడు ఎక్కడున్నాడో తెలుసా?

-

గుడిలో ప్రసాదం అంటే అందరికి నో్రూరించేది పులిహోర, దద్దోజనం.. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వీటినే ఎక్కువగా పెడతారు.. అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన ప్రసాదాన్ని పెడతారు. దేశంలో ఎన్నో ప్రధానమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా మొత్తం మూడు కోట్ల మంది దేవుళ్లను ప్రజలు పూజిస్తున్నారు. ఆయన దేవతలందరికీ రకరకాల నైవేద్యాలను భక్తులు సమర్పిస్తూ ఉంటారు. దేవుళ్లకు ఇష్టమైన వాటిని ఎక్కువగా పెడతారు..ఇలా గణపతికి పత్రి, కృష్ణుడికి వెన్న శివుడికి బిల్వ పత్రం లాగా ప్రతి దేవునికి రకరకమైన నైవేద్యాలు సమర్పిస్తుంటారు.

అయితే ఇప్పుడు మనం చెప్పుకొనే దేవుడికి మాత్రం పిల్లలు ఇష్టంగా తినే చాక్లేట్ లను నైవేద్యంగా పెడతారు.ఏంటి ఇది నిజమా అని ఆశ్చర్య పోకండి.. మీరు విన్నది నిజమే.ఈ వింత ఆచారం కేరళ రాష్ట్రంలోని తెక్కన్ పలని బాలసుబ్రమణ్యం దేవాలయంలో భక్తులు చాక్లెట్లను నైవేద్యంగా సమర్పిస్తూ వస్తున్నారు. అవును గత ఆరు ఏళ్లగా ఈ ప్రదేశం మంచ్ మురుగన్ దేవాలయం గా ప్రసిద్ధి చెందింది. బాల మురుగన్ మంచ్ మురుగన్ గా ఎలా మారాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరు సంవత్సరాల క్రితం ఆడుకుంటున్న ఒక చిన్న ముస్లిం పిల్లాడు ఈ దేవాలయానికి వచ్చి గంట కొట్టాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని మందలించారు. అదే రోజు రాత్రి బాలుడి ఆరోగ్యంలో మార్పు వచ్చింది.. దాంతో భయపడిన తల్లి, దండ్రులు భయపడి పోయారు..వెంటనే గుడికి వెళ్లి ప్రార్దరనలు చేశారు.పూజారి దేవుడికి ఏదైనా నైవేద్యంగా సమర్పించాలన్నప్పుడు ఆ తల్లిదండ్రులు నువ్వుల నూనె ఇవ్వడానికి అంగీకరించారు. అక్కడే ఉన్న కుర్రాడు తన దగ్గర ఉన్న మంచ్ చాక్లెట్ ని దేవుడికి నైవేద్యంగా పెట్టాడు. ఇక ఆ తర్వాత అద్భుతం జరిగింది. ఈ ఘటన తర్వాత ఆ పిల్లాడు కోలుకున్నాడు. దీంతో భక్తులు మంచ్ చాక్లెట్ ను అప్పటి నుంచి మురుగన్ కి నైవేద్యంగా సమర్పించడం మొదలుపెట్టారు.. అలా అప్పటి నుంచి చాక్లేట్ లను ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తుంది… అది అసలు మ్యాటర్..

Read more RELATED
Recommended to you

Latest news