ప్యాకెట్ పాలు తాగొద్దు.. ఫ్యాక్టరీల్లో ఏం చేస్తున్నారో తెలుసా ?

-

ఇప్పుడు ఆధునిక యుగంలో అన్నీ ప్యాకెట్లలోనే.. చివరకు పాలు కూడా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ డైరీ రంగం కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. అనేక ప్రముఖ కంపెనీలు ఈ రంగంలోకి వచ్చాయి. అయితే ఈ ప్యాకెట్ పాలు సురక్షితమైనవేనా అన్న అనుమానం కలుగక మానదు.

ఎందుకంటే.. కొన్ని రసాయనాలు, యూరియా కలిపి కృత్రిమ పాలు తయారు చేసే దుర్మార్గుల బండారం అనేక సార్లు బయటపడింది. కాకపోతే ఈ కల్తీలు చిన్న మొత్తాల్లో బయటపడ్డాయి. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట సమీపంలో ఇటీవలి కాలంలో ఓ చిన్న పాల పరిశ్రమ నుంచి ఇలాంటి నిషేధిక రసాయనాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు కూడా.

అయితే ఇదేదో చిన్న కంపెనీల పని.. పెద్ద కంపెనీల పాలు సురక్షితం అనుకోవడానికి వీలు లేదంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాల్లో పాల ఉత్పత్తికి కనీసం మూడు రెట్లు పాల వినియోగం ఉందని.. ఇది కల్తీ లేకుండా ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. డిమాండ్ ను తట్టుకునేందుకు పాల పరిశ్రమలు ఇలాంటి కల్తీలకు పాల్పడకుండా పాలు తయారు చేసే అవకాశమే లేదంటున్నారు.

అందుకే అవకాశం ఉంటే.. గేదెలు, ఆవులు ఇచ్చిన పాలను కొనుక్కోవాలని సలహా ఇస్తున్నారు. ఇక ఈ ప్యాకెట్ పాలు అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని సూచిస్తున్నారు. పెద్దవారు అసలు ఈ ప్యాకెట్ పాల జోలికి పోకుండా ఉంటేనే ఉత్తమమని సలహా ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news