నిద్రలేచాక వీటిని చూడద్దు.. చిక్కుల్లో పడతారు..!

-

నిద్రలేచిన తర్వాత ప్రశాంతమైన వాటిని, మంచి జరిగే వాటిని చూడాలని అంటూ ఉంటారు నిద్రలేచిన తర్వాత కొన్నిటిని అస్సలు చూడకూడదు. అటువంటిది చూస్తే ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కోవాలి. నిద్రలేచిన తర్వాత అస్సలు వీటిని చూడకండి. వీటిని చూస్తే దురదృష్టం కలుగుతుంది. ఉదయం లేచిన తర్వాత భూదేవికి నమస్కారం చేసుకోవడం. దేవుడి ఫోటోకి నమస్కారం చేసుకోవడం మంచిది.

అలా చేసి నిద్ర లేస్తే మంచి జరుగుతుంది. దేవుడు ఫోటోని కానీ చేతికి ఉన్న ఉంగరాలని కానీ చాలామంది చూసుకుంటూ ఉంటారు కానీ కొన్నిటిని చూస్తే దరిద్రం పట్టుకుంటుంది. కొందరు దంతాలని శుభ్రం చేసుకునేటప్పుడు అలా అటు ఇటు తిరుగుతారు. అలా తిరగకూడదు. సూర్యుడికి ఆగ్రహం కలుగుతుంది. డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అయిపోతుంది. స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి వంటింట్లోకి వెళ్ళకూడదు. అది తప్పు.

శుభ్రం చేయని పాత్రలని ఉదయాన్నే లేచి చూడకూడదు. ఉదయం లేవగానే జంతువుల బొమ్మలని చూడడం కూడా అస్సలు మంచిది కాదు. నిద్ర లేచాక భూదేవికి నమస్కారం చేసుకోవాలి. పాపాలన్నిటినీ భూదేవి మోస్తుంది కాబట్టి నిద్ర లేవగానే భూదేవికి నమస్కారం చేసుకోండి. లేచిన వెంటనే వేదమంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడిని చూస్తే మంచిది. ఆవుని, తులసి మొక్కని నిద్ర లేవగానే చూస్తే మంచి జరుగుతుంది. గుడి గోపురం ని నిద్రలేచిన వెంటనే చూడడం మంచిది. బంగారాన్ని, ఎర్రచందనాన్ని, ఆవు దూడ చూస్తే కూడా ఉదయాన్నే శుభం కలుగుతుంది. రోజు అంతా కూడా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news