తమ్ముళ్ల మాట: లోకేష్ మాట నమ్మొద్దు బాబు గారు!

-

ఏపీ శాసన రాజధాని ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేసిన చినబాబు లోకేష్ యాత్రవల్ల ఎవరికి భరోసా కలిగిందో, మరెవరికి ధైర్యం వచ్చిందో తెలియదు కానీ.. చంద్రబాబుకు మాత్రం బూస్ట్ దొరికిందని అంటున్నారు చినబాబు ఫ్యాన్! అయితే.. అవి కేవలం మీడియా ముచ్చట్లని, అలాంటి మాటలు నమ్మి పగటి కలలు కంటే అదఃపాతాళానికి పోవడం ఖాయమని చెబుతున్నారు టీడీపీ సిసలైన కార్యకర్తలు!

అవును… అమరావతి ఉద్యమం 300రోజుల సందర్భంగా మాట్లాడిన చినబాబు లోకేష్… చంద్రబాబుకు గుండెలనిండా ఆనందం కలిగించే మాటలు మాట్లాడారు! ఏమనంటే… “2024లో చంద్ర‌బాబు సీఎం కావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు” అని! గ్రౌండ్ కి వెళ్లి చాలా రోజులు అయ్యింది కదా..ప్రజలు అలానే ఆలోచిస్తున్నారేమో అని.. చినబాబు మాటలకు పొంగిపోతున్నారంట చంద్రబాబు!

అయితే ఈ మాటలు వింటే ఇప్పుడున్న వైభవం కూడా మిగలదని అంటున్నారు టీడీపీ సిసలైన కార్యకర్తలు! ఏదో లోకేష్ వచ్చారు కాబట్టి ఆ గ్రామాల్లోని మన కార్యకర్తలు కాస్త అలాంటి నినాదాలూ గట్రా చేసి ఉంటే ఉండొచ్చు.. పొరపాటున అవి చినబాబు చెవిలో పడితే పడి ఉండొచ్చు.. అంతే తప్ప వాస్తవాలు అలా లేవని, మీరింకా కరోనా భయంలోనే ఉంటే.. ఇప్పుడున్న నెంబర్లు కూడా పడిపోతాయని చెబుతున్నారంట!

మరి చంద్రబాబు… తన సుపుత్రుడి మాటలు విని ఊహల పల్లకీలో ఊరేగుతారా లేక కార్యకర్తలు చెబుతున్న వాస్తవాలను గ్రహించి నడుచుకుంటారా అన్నది వేచి చూడాలి!!

Read more RELATED
Recommended to you

Latest news