BREAKING : యాదాద్రి ఆలయం, టెంపుల్ సిటీ ప్రాంతాల్లో డ్రోన్ కలకలం

-

యాదాద్రి జిల్లా : యాదాద్రి ఆలయం, టెంపుల్ సిటీ ప్రాంతాల్లో డ్రోన్ కలకలం రేపింది. ఈ నెల 18 వ తేదీన రాత్రి 9 గం.ల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. పెద్దగుట్ట నుండి యాదాద్రి ఆలయం, టెంపుల్ సిటీ ప్రాంతాల్లో డ్రోన్ ఆపరేట్ చేశారు ఇద్దరు వ్యక్తులు.

అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా టెంపల్ సిటి ఏరియా నుండి డ్రోన్ కెమెరా ను పంపి శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి టెంపల్ ను వీడియో షూట్ చేశారు ఆ ఇద్దరు యువకులు. ఇక దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు.. చందు, నిఖిలేష్ లుగా నిందితులను గుర్తించారు. అనంతరం ఆ ఇద్దరు నిందితులపై కేసు నమోదు..చేసిన పోలీసులు, వారి వద్ద నుండి డ్రోన్ కెమెరా ను స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news