పదవులిచ్చేది నేను కాదు.. ఎమ్మెల్యేలకు మంత్రి మల్లారెడ్డి కౌంటర్

-

తనపై మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. పదవులు ఇచ్చేది.. కేసీఆర్​, కేటీఆర్‌ తప్ప తాను కాదని కార్మికశాఖ స్పష్టం చేశారు. మేడ్చల్‌ జిల్లాలో పదవుల కేటాయింపుపై నిన్న ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు.. తన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయటం పట్ల మీడియాతో ఇష్టాగోష్ఠిలో మల్లారెడ్డి మాట్లాడారు. తాను గాంధేయవాదినని.. ఎవరితో గొడవ పెట్టుకునే రకం కాదని తెలిపారు.

తమది క్రమశిక్షణ గల పార్టీ అని వ్యాఖ్యానించిన ఆయన.. ఇంటి సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు. జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్తానన్న మల్లారెడ్డి.. అవసరమైతే అందరినీ ఇంటికి ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. తమ మధ్య ఆ స్థాయిలో సమస్యలేదని.. కావాలనే కొందరు పెద్దది చేసి చూపుతున్నట్లు ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news