బ్రేకింగ్ : దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు.. ఆమెకే టికెట్

-

దుబ్బాక అసెంబ్లీ నియోజకర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దానికి టిఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత పేరును సిఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కృయాశీల పాత్ర పోషించారన్న కేసీఆర్ ఉద్యమం కోసం, పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారని అన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పని చేశారని కేసీఆర్ అన్నారు.

రామ లింగా రెడ్డి కుటుంబం మొత్తం అటు ఉద్యమంలో అలానే ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాల్పంచుకుందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో ఆ కుటుంబానికి అనుబంధం ఉందన్న ఆయన రామలింగారెడ్డి తల పెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించడానికి, నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు యధావిధిగా అమలు కావడానికి సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులే నియోజకవర్గానికి ప్రాధినిద్యం వహించడం సమంజసమని అన్నారు. జిల్లాలోని టీఆర్ఎస్ నాయకులందరితో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని కేసీఆర్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news