ఏపీలో పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరణ

-

ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాల నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది.స్కీమ్స్‌కు ఫండ్స్ విడుదల చేసేందుకు ఎలక్షన్ కమిషన్ రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇన్ ఫుట్ సబ్సిడీ పంపిణీతో పాటు పంట నష్ట పరిహారం చెల్లించేందుకు కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వలేదు. ఎన్నికల నేపథ్యంలో ఈసీ అనుమతి నిరాకరించడంతో ఆంధ్ర ప్రదేశ్ లో సంక్షేమ పథకాలకు బ్రేక్ పడింది.

ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత యధావిధిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగనున్నాయి.కాగా, ఏపీలో ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news