ఢిల్లీ లిక్కర్ స్కాం లో సప్లమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడి

-

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాం లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడి. దీంతో ఈడీ చార్జి షీట్ పై టెన్షన్ నెలకొంది. ఈ ఛార్జ్ షీట్ లో తెలంగాణ కు చెందిన రాజకీయ నాయకుల పేర్లు ఉండే అవకాశం ఉంది. ఛార్జ్ షీట్ లో ఎవరి పేర్లు వస్తాయో అని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సమీర్ మహేంద్ర అతని నాలుగు కంపనీలపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడి.

లిక్కర్ స్కాం లో సౌత్ గ్రూప్ ప్రస్తావన తెచ్చింది ఈడి. అలాగే లిక్కర్ స్కాం లో మని లాండరింగ్ అంశాలపై విచారణ జరుపుతున్నారు ఈడి అధికారులు. ఇప్పటి వరకు లిక్కర్ స్కాం లో సమీర్ మహేంద్ర, శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరా లను అరెస్ట్ ఈడి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాం విచారణ కోసం పలువురికి నోటిసులు ఇచ్చి విచారించింది ఈడి.

Read more RELATED
Recommended to you

Latest news