భారతీయుల విశ్వాసాలు కాపాడే పార్టీ కూడా బీజేపీనే – ఈటల

-

కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లి కాలనీ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ పాలొన్నారు. కంటోన్మెంట్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి గా వంశ తిలక్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. బీజేపీ కేవలం జై శ్రీరామ్ అని మాత్రమే ఓట్లు అడగడం లేదన్నారు. బీజేపీ అభివృద్ధి చేసి చూపించి అడుగుతోందన్నారు. కాదు భారతీయుల విశ్వాసాలు కాపాడే పార్టీ కూడా బీజేపీనే అని అన్నారు.

ఒకప్పుడు ప్రపంచం అంటే అమెరికా రష్యా దేశాలు మాత్రమే. ఇప్పుడు భారత్ చేరిందన్నారు. యుద్ధాన్ని ఆపడానికి మీ సహకారం కావాలని రష్యా ఉత్తరం రాసింది అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగామో తెలిసిందా అన్నారు. ప్రపంచం లో భారత ఆర్థిక వ్యవస్థను 11 వ స్థానం నుండి 5 వ స్థానం కి బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఈసారి కనుక మళ్ళీ అధికారం ఇస్తే 3వ స్థానంలో నిలుపుతాము అని మోడీ హామీ ఇస్తున్నారు అని ఈటల అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news