దమ్ముంటే నాపై పోటీ చెయ్.. కేసీఆర్ కు ఈటల సవాల్

-

కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ మండలం చెల్పూర్ లో పెద్ద ఎత్తున ముదిరాజ్ కులస్తులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల మాట్లాడుతూ.. “రేపు ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా నా గెలుపును ఆపలేరని… దమ్ముంటే కేసీఆర్.. నా మీద పోటీ చేసి గెలువు ” అంటూ సవాల్ విసిరారు.

బక్క పల్చటి పిలగాడు, దిక్కులేని పిలగాడని నన్ను అనుకుంటున్నావ్? నేను దిక్కులేని వాన్ని కాదు.. హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను అంటూ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. పదేసి లక్షలు దళిత బంద్ ఇచ్చినా, గొర్రెలిచ్చినా, కులాలవారిగా తాయిలాలిచ్చినా.. నేనే వాళ్ల గుండెళ్లో ఉన్నారేపు ఎన్నికల్లో చూసుకుందామని టిఆర్ఎస్ కు సవాల్ విసిరారు.

ప్రజల ఓట్లతో వచ్చిన మీ పదవులతో వాళ్లకు ద్రోహం చేస్తే కర్రు కాల్చి వాతపెడతారని హెచ్చరించారు. ఈటల రాజేందర్ ను ఓడించేందుకు ఐదు వేల కోట్లైనా ఖర్చు చేస్తారట అని ఫైర్ అయ్యారు. గతంలో ఏనాడు ఈ నియోజవర్గంలో కనిపించని మంత్రులు ఇప్పుడు ఎందుకు వస్తున్నట్లు ? అని ప్రశ్నించారు. ఎక్కడ దు:ఖం ఉన్నా, ఆపద ఉన్నా అక్కడుండే బిడ్డను తానని… ఎలాగైన హుజూరాబాద్ ప్రజలు న్యాయానికే ఓటు వేస్తారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news