మ‌రో రాష్ట్రంలో ఎన్నిక‌ల షెడ్యూల్ మార్పు

-

కేంద్ర ఎన్నిక‌ల సంఘం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే పంజాబ్ రాష్ట్ర ఎన్నిక‌ల షెడ్యూల్ ను మార్చిన కేంద్ర ఎన్నికల సంఘం తాజా గా మ‌రో రాష్ట్రంలో ఎన్నిక‌ల షెడ్యూల్ ను మార్చింది. పంజాబ్ లో ర‌వి దాస్ జ‌యంతి ఉత్స‌వాల కార‌ణంగా పంజాబ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల షెడ్యూల్ లో మార్పులు చేసింది. ఇప్పుడు ఇప్పుడు తాజా గా మ‌ణీపూర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో షెడ్యూల్ లోనూ మార్పులు చేసింది.

మ‌ణీపూర్ లో ఫిబ్ర‌వ‌రి 28, మార్చి 5న రెండు ద‌శ‌ల‌లో ఎన్నికలు జ‌రుగుతాయ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలిపింది. అయితే ఇప్ప‌డు తాజా గా షెడ్యూల్ మార్చి.. ఫిబ్ర‌వ‌రి 27, మార్చి 3 తేదీల‌లో మ‌ణీపూర్ రాష్ట్రంలో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. కాగ పంజాబ్ రాష్ట్రం లో ర‌వి దాస్ జ‌యంతి సంద‌ర్భంగా ఎన్నిక‌లు వాయిదా వేయాల‌ని రాష్ట్ర పార్టీలు అన్నీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం పంజాబ్ లో ఎన్నికల షెడ్యూల్ ను మార్చింది. ఇప్పుడు తాజా గా మ‌ణీపూర్ లో కూడా ఎన్నిక‌ల షెడ్యూల్ ను మార్చింది.

Read more RELATED
Recommended to you

Latest news