ఒడిశాలో ఎన్నికలు.. హైదరాబాద్ లో ప్రచారం

-

త్వరలోనే ఒడిశాలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు ఎన్నికల్లో గెలిపి లక్షలు విహాలను రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిస్సా ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటించారు.దీంతో అక్కడి అధికార పార్టీ బిజూ జనతాదళ్ ప్రచారం ముమ్మరం చేసింది. చాలామంది ప్రజలు ఒడిశా నుంచి హైదరాబాద్కు భారీగా వలస వస్తుంటారు.

దీంతో BJD నేతలు హైదరాబాద్లో ప్రచారం చేస్తున్నారు. ఒడిశా వాసులు అధికంగా ఉండే కూకట్పల్లిలో ఆత్మీయ సమావేశం నిర్వహించి, ఓట్లు అభ్యర్థించారు. సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని BJDకి మరోసారి ఓటు వేయాలని కోరారు. కాగా, దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన విషయం తెలిసిందే.ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news