ఇది మీకే.. ఎలక్ట్రిక్ వస్తువుల ధరలు పెరుగనున్నాయి.. త్వరపడండి..

-

రోజు రోజు దేశంలో అన్ని వస్తువుల ధరలు పెరిగి పోతున్నాయి. తాజాగా మరోసారి ఎలక్ట్రిక్ వస్తువుల ధరలు పెరుగనున్నాయి. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మిషిన్ లాంటి ఎలక్ట్రిక్ వస్తువులు కొనాలనుకునే వారు త్వరపడండి. వీటి ధరలు 3 నుంచి 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో కానీ ధరలు పెరగనున్నాయి. ఈ విషయం గురించి ఎలక్ట్రానిక్స్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ.. ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల వీటి ధరలను పెంచక తప్పడం లేదని ఆయన వెల్లడించారు.

Amazon Great Sale: Grab Up To 50% Discount on TVs and Other Appliances - Gizbot News

అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి విలువ మరింత పతనం కావడం వల్ల దిగుమతి చేసుకుంటున్న విడిభాగాలకు మరింత ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. ఈ కారణం వల్లే ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలను 3 నుంచి 5 శాతం వరకు పెంచాల్సి వస్తోందని తెలిపారు. పానాసోనిక్ ఇండియా సీఈవో మనీశ్ శర్మ మాట్లాడుతూ, వివిధ ఉత్పత్తుల ధరలను జనవరిలోనే కొంత మేర పెంచామని… ఇప్పుడు మరోసారి 4 నుంచి 5 శాతం వరకు పెంచక తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news