భారీ ఎన్‌కౌంటర్‌, నలుగురు ఉగ్రవాదులు హతం..!

-

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లా పింజోరా ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా దశాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు ఉగ్రవాదులు మరణించగా, ముగ్గురు సైనికులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news